తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు యాదగిరి గుట్టకు చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం, పరిసరాల అభివృద్ధి పనుల పురోగతిని సీఎం పరిశీలించనున్నారు.
అలాగే ప్రెసిడెన్షియల్ సూట్, ఇతర కాటేజీల నిర్మాణాలను పరిశీలించనున్నారు. మహా సుదర్శన యాగం జరిపే ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ గుర్తించనున్నారు. సీఎం రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.