తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆమె మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ నొప్పి తీవ్రం కావడంతో ఆదివారం సాయంత్రం సోమాజిగూడ యశోద హాస్పిటల్లో కుటుంబసభ్యులు ఆమెను చేర్పించారు.
నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. సీఎం కుటుంబసభ్యుల అంగీకారంతో శోభకు యశోద ఆస్పత్రి డాక్టర్లు మోకాలి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం శోభ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు.
ఆమె ఆరోగ్య పరిస్థితినిడాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ కాసేపట్లో యశోద హాస్పిటల్ కి వెళ్లనున్నారు.