telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ హస్తినకు పయనమయ్యారు.

జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేసీఆర్​ దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి నేతలతో చర్చలు జరిపిన కేసీఆర్‌​ ఈ సారి జాతీయస్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

నేటి నుంచి 8 రోజులపాటు పలు రాష్ట్రాలలో కేసీఆర్ పర్యటించనున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పలు పార్టీల నేతలు, మీడియా, ఆర్థిక వేత్తలతో అక్కడ సమావేశమవుతారు. దేశ ఆర్థిక పరిస్థితులపైనా చర్చించనున్నారు.

 

Related posts