telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వైద్య పరీక్షల పూర్తి చేసుకొని ప్రగతిభవన్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్‌…

Kcr telangana cm

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు.  ఊపిరితిత్తుల్లో మంటగా  ఉండటంతో శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందులు పడ్డారు.  వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.  ఎంఆర్ఐ తో పాటుగా కేసీఆర్ కు సిటీ స్కాన్ చేశారు.  ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కుదురుగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ కు సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో సీఎంకు నిన్న వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు సీఎం ఇవాళ ఆస్పత్రికి వెళ్లి మరికొన్ని వైద్య‌ ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. వైద్య పరీక్షల పూర్తి అనంతరం సీఎం ప్రగతిభవన్‌కు బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. అయితే కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లడం తో ఆయన అభిమానులు అలాగే అనుచరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు కేసీఆర్ క్షేమంగా ఉండటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related posts