telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు…

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..అయితే తాజా బులెటిన్ ప్రకారం కొత్తగా రాష్ట్రంలో 205 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,068 కి చేరింది. ఇందులో 2,77,304 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,231 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం తాజాగా కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1533 కి చేరింది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 95.8 శాతంగా ఉంటే.. స్టేట్‌లో 97.13 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక తాజా బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజు 551 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న తెలంగాణాలో 27,244 పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 67,47,990 కి పరీక్షలు జరిగాయి.

Related posts