ఈ నెల 5న సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు హైద్రాబాద్ ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహిస్తారు. ఈ భేటీకి మంత్రులు, సీఎస్, డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా కరోనా మహమ్మారి నియంత్రణపై ఎక్కువ దృష్టి సారించనున్నారు. కరోనా నేపథ్యంలో, విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా విశ్లేషించనున్నారు. సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణంపై చర్చించనున్నారు. నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.