telugu navyamedia
తెలంగాణ వార్తలు

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..పోలీసు కేసు నమోదు

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్‌ ప్రవక్తను కించపరిచే విధంగా సోమవారం రాత్రి రాజాసింగ్‌.. యూ ట్యూబ్‌లో వీడియోను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది.

దీంతో తమ మనోభావాలను కించపరిచే విధంగా రాజాసింగ్‌ వ్యాఖ్యలు చేశారని ముజ్లిస్‌ నేతలు ఆరోపించారు. ఈక్రమంలో మజ్లిస్‌ నేతలు.. అర్ధరాత్రి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాలలో నిరసనలు చెలరేగాయి.

హాస్యనటుడు మునావర్ ఫరూఖీ, అతని తల్లిని కూడా “కామెడీ” అని రాజాసింగ్ అన్నారు. రాజాసింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది ప్రజలు వీధుల్లో నిరసనలు చేశారు.

ఇటీవ‌ల‌ సస్పెండ్ చేయబడిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఇటీవల టీవీలో చెప్పిన కొన్ని విషయాలను రాజాసింగ్ సైతం ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది.

అప్పట్లో నుపుర్ శర్మ వ్యాఖ్యలను ముస్లిం దేశాలు అన్నీ తీవ్రంగా ఖండించాయి. భారత దేశం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో నుపుర్ శర్మను బీజేపీ అధికార ప్రతినిధిగా అధిష్ఠానం సస్పెండ్ చేసింది.

 కాంగ్రెస్ నేత రషెద్ ఖాన్ నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా తన మద్దతుదారులతో  దబీర్‌పురా పోలీస్ స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్‌పై మంగళవారం డబీర్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts