telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ టూ ఏపీ..కేంద్రం శుభవార్త

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి స్థిరపడాలని భావించిన వారికి కేంద్ర సర్కారు శుభవార్త చెప్పింది. ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి స్థానికత కల్పించేందుకు ఇప్పటివరకూ ఉన్న ఐదేళ్ల గడువును ఏడేళ్లకు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.

కేంద్ర హోమ్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గెజిట్ లో ప్రచురించింది. ఇటీవల జగన్ న్యూఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు గడువును పొడిగించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. జగన్ కోరిక మేరకు మోదీ స్వయంగా హోమ్ శాఖకు స్థానికత గడువును పెంచాలని సూచించినట్టు సమాచారం.

Related posts