telugu navyamedia
తెలంగాణ వార్తలు

నా మాటల్లో తప్పేమిటో అర్థం కావడం లేదు..జగన్‌తో చర్చించి 5 గ్రామాలను ఇప్పించండి

* ఏపీ మంత్రులు వ్యాఖ్యలు బాధాకరం
* నా మాటల్లో తప్పేమిటో అర్థం కావడం లేదు.
* కరకట్టల నిర్మాణానికి 5 గ్రామాలను ఇవ్వాలని కోరుతున్నాం..

ఏపీ మంత్రులు బొత్స, అంబటి రాంబాబు వ్యాఖ్యలు బాధాకరమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. నా మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదని ఏపీ మంత్రులకు సూచించారు.

హైదరాబాద్‌ ఇస్తారా అని బొత్స అనటం.. అసందర్భం, అర్థరహితమని స్పష్టం చేశారు. నా మాటల్లో తప్పేమిటో అర్థం కావడం లేదన్నారు. భద్రాద్రి రాముడు నీటిలో మునిగితే ఏపీ ప్రజలకు కూడా బాధగానే ఉంటుందని మంత్రి పువ్వాడ తెలిపారు.

ప్ర‌జ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధులు ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంది. సీఎం కేసీఆర్‌తో జ‌గ‌న్ చ‌ర్చ‌ల‌కు వ‌చ్చేలా మంత్రులు కృషి చేయాల‌ని అన్నారు

జగన్‌తో చర్చించి 5 గ్రామాలను ఇప్పించండ‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 5 గ్రామాలను కలిపితేనే కరకట్టల నిర్మాణం సాధ్యమ‌ని, సున్నితమైన అంశాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవాలి. నా మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదు. బేషజాలకు పోకుండా ప్రజా సమస్యలు పరిష్కరించాలని మంత్రి అన్నారు.

భద్రాచలం ఆలయం మునగకుండా ఉండాలనేది మా ఉద్దేశమని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. కరకట్టల నిర్మాణానికి 5 గ్రామాలను ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు.

కేసీఆర్‌తో జగన్ చర్చలకు బొత్స, అంబటి కృషి చేయాలని సూచించారు. భద్రాచలం రాముడు మునగకుండా చూడాలంటే ఏపీ సహకరించాలని పువ్వాడ అజయ్ విజ్ఞప్తి చేశారు.

Related posts