telugu navyamedia
క్రీడలు క్రైమ్ వార్తలు వార్తలు

జీవా ధోనికి అత్యాచార బెదిరింపులు… 16 ఏళ్ళ బాలుడు అరెస్ట్…

గత ఏడాది ప్రపంచ కప్ తర్వాత నుండి క్రికెట్  కు దూరంగా ఉన్న మహేంద్రసింగ్ ధోని ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఆ తర్వాత గత నెల 19న యూఏఈ వేదికగా ప్రారంభమైన ఐపీఎల్ 2020 లో ప్రస్తుతం ఆడుతున్నాడు. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో ధోని పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై, 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ధోని 12 బంతుల్లో కేవలం 11 పరుగులు చేయగలిగాడు.

అయితే ఇక ఈ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో ధోని కుటుంబం కు సంబంధించి అసభ్యకర పోస్టులు వచ్చాయి. ఈ మ్యాచ్ ధోని ఆడకపోవడం కారణంగానే చెన్నై ఓడిపోయిందని తర్వాతి మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడకపోతే జీవా పై అత్యాచారం చేస్తానంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు ఓ వ్యక్తి. ఇక తాజాగా ఈ అసభ్యకర కామెంట్లు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసారు అహ్మదాబాద్ పోలీసులు. గుజరాత్‌లోని ముంద్రా ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడిగా రాంచీ పోలీసులు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆ పోస్ట్ తానే చేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఇక రాంచీ పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత బాలుడిని వారికి అప్పగిస్తాము అని స్థానిక ఎస్పీ పేర్కొన్నారు .

Related posts