టీమ్ఇండియాకు మరోసారి 20శాతం జరిమానా విధించారు. న్యూజిలాండ్తో నాలుగో టీ20లో మందకొడిగా బౌలింగ్ చేసినందుకు టీమ్ఇండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40శాతం(రెండు ఓవర్లు) కోత పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం జరిగిన ఐదో టీ20లో స్లో ఓవర్రేట్ కారణంగా జరిమానాకు గురైంది.
నిర్ణీత సమయంలో భారత్ ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రెఫరీ క్రిస్ బ్రాడ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐదో టీ20లో టీమ్ఇండియాకు నాయకత్వం వహించిన రోహిత్ శర్మ.. రెఫరీ విధించిన ఫైన్ను అంగీకరించాడు.