telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్…యూటీఎఫ్ అభ్యర్థి ఘనవిజయం

Teachers Mlc elections won by UTF

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి  గట్టి షాక్ తగిలింది. ఇటీవల జరిగిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి పాలైంది. టీఎస్ యూటీఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌పై 2637 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు.

టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 8924 ఓట్లు రాగా, పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌కు 6287 ఓట్లు వచ్చాయి. గతంలో నర్సిరెడ్డి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌కి అధికార పార్టీ టీఆర్‌ఎస్ తన మద్దతును ప్రకటించగా, టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి సీపీఎం తమ మద్దతును ప్రకటించింది. ఇలా అధికార పార్టీ బలపర్చిన అభ్యర్ధిపై సీపీఎం మద్దతిచ్చిన నర్సిరెడ్డి విజయం సాధించడం సంచలనంగా మారింది.

Related posts