telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

విద్యార్థిని పై అత్యాచార యత్నం చేసిన ఉపాధ్యాయుడు…

ఏ మతాచారాల ప్రకారమైనా గురువుకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉంటోంది. అయితే ఇటీవల తెలంగాణలో ఓ ఉపాధ్యాయుడు గురువుకున్న పరువును తీసే విధంగా ప్రవర్తించాడు. ఆ ఉపాధ్యాయుడు ఐదుగురు మైనర్ బాలికలపై అత్యాచార యత్నం చేశాడు. ఈ ఘటన తెలంగాణ కోత్తగూడెంలోని భద్రాద్రి ప్రాంతంలోని స్యూళ్లులో చోటుచేసుకుంది. అయితే ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ద్వారా పోలీసులు విచారణ జరిపేందుకు స్యూళుకు చేరుకున్నారు. అక్కడ విచారణ ద్వారా అతడు మరో నలుగురిని కూడా లొంగదీసుకొనేందుక ప్రయత్నించాడని తేలింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలను సూపర్‌డెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ తెలిపారు. ‘ అమ్మాయి తల్లిదండ్రు ఫిర్యాదులో మేము రంగంలోకి దిగాం. విచారణ జరిపేందుకు స్కూల్‌కు వెల్లాకే మాకు తెలిసింది. దోడా సినిల్ కూమార్ అనే ఉపాధ్యాయుడు అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. అతడు మరో నలుగురిపై కూడా తన ప్రయత్నాలు చేశాడని తేలింది. ప్రతి అమ్మాయి కూడా 6 నుంచి 10 సంవత్సారాలలోపు వయసు వారే. ఈ సంఘటనలు దాదాపు ఆగస్టు నుంచి నవంబరు మధ్య జరిగాయి. దాంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నార’ని తెలిపారు. అతడు నేడు రిమాండ్‌కు వెళ్లనున్నాడని, అతడిపై సెక్సన్స్ 376ఏబీ, పోస్కో యాక్ట్‌లోని సెక్షన్ 6 ప్రకారం కేసును నమోదు చేశామని పేర్కొన్నారు.

Related posts