telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దుర్మార్గులను ఉద్యోగ సంఘాలు అడ్డుకోవాలి: యనమల

Yanamala tdp

ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమైన చర్యగ అని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అభివర్ణించారు. ఇలాంటి దుర్మార్గులను ఉద్యోగ సంఘాలు అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేతల విమర్శల దాడి కొనసాగుతోంది. తాజాగా ఆయన స్పందించారు.

గత ప్రభుత్వంలో పని చేసిన ఉద్యోగులపై కక్ష సాధించడం గర్హనీయమని అన్నారు. ఉద్యోగులకు రాజకీయాలు ఆపాదించొద్దని, నెలల తరబడి పోస్టింగ్స్ లేకుండా వెయిటింగ్ లో ఉంచొద్దని సూచించారు. ఒక వ్యక్తిపై కక్ష సాధింపు కోసం రాష్ట్ర్రాన్ని పణంగా పెడుతున్నారంటూ సీఎం జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

Related posts