ఈసీ షెడ్యూల్ ప్రకటించాక ఎన్నికలు వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వాయిదా, నిలిపివేత అధికారం ఈసీకే ఉంటుందని పేర్కొన్నారు. ఈసీ అధికారాల్లో ప్రభుత్వ జోక్యం తగదని అన్నారు.
గెలవలేమనే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు ఎన్నికలను వాయిదా వేయించారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని అన్నారు. ఆర్డినెన్స్ను కోర్టులో సవాల్ చేస్తామని యనమల తెలిపారు. ఫ్యాక్షనిస్ట్ పాలనలో ఇలాంటి చీకటి చట్టాలే చేస్తారని యనమల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇలాంటి అరాచక పాలన గతంలో లేదన్నారు.