telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రకాశంజిల్లా దర్శిలో టీడీపీ విజయం..

ప్రకాశంజిల్లా దర్శి నగరపంచాయతీని తెలుగుదేశంపార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు గాను ఒక వార్డులో ఏకగ్రీవం కాగా… 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ప్రకటించిన 19 స్థానాలకు గాను 13 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది.

మెజారిటీ స్థానాలను తెలుగుదేశంపార్టీ చేజిక్కించుకోవడంతో నగరపంచాయతీ ఛైర్ పర్సన్ పదవిని తెలుగుదేశంపార్టీ వార్డు సభ్యుల్లో ఒకరు చేపట్టబోతున్నారు. 3, 4, 10, 12, 13, 14, 15, 17, 18, 19 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే 1, 2, 5, 6, 7, 9 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దర్శిలో తెలుగుదేశంపార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చి … మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు.

వైసిపి- టిడిపి మధ్య హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రం బయట సంబరాలు చేసుకున్నారు . దర్శి నగర పంచాయతీ టిడిపి చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారపు శెట్టి శ్రీరాములు కుమారుడు నారపుశెట్టి పిచ్చయ్య ను ప్రతిపాదించారు.

Related posts