రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వెనకున్న ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని సుప్రీంకోర్టు వెల్లడించింది.
ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.రాజ్యాంగ సంస్థలతో ఆటలు వద్దని హెచ్చరించడం రాష్ట్ర ప్రభుత్వ మనుగడను ప్రశ్నార్థకంలోకి నెట్టిందని సోమిరెడ్డి అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కును కోల్పోయిందని సోమిరెడ్డి అన్నారు.