ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలనపై టీడీపీ బుక్ విడుదల చేసింది. ‘మంచి సీఎం కాదు.. జనాన్ని ముంచే సీఎం’ పేరుతో బుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత యనమల మాట్లాడారు. ప్రజలు ఒక్కచాన్స్ ఇస్తే మోసం చేశారని విమర్శించారు. ఆరు నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు.
హామీ ఇచ్చిన పథకాల కంటే రద్దు చేసిన పథకాలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. .ఇప్పటికే 62వేల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. ఉద్యోగుల జీతభత్యాలు కూడా చెల్లించలేని స్థితికి తెచ్చారని ఆయన అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే జగన్..అవినీతిని అరికడతారా? అని ప్రశ్నించారు.