ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లు ఆ పార్టీని వీడారు. భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈ ముగ్గురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాలు కప్పి జేపీ నడ్డా వీరిని సాధరంగా ఆహ్వానించారు.
అనారోగ్య కారణంగా ఎంపీ గరికపాడి మోహన్రావు వీరితో పాటు నేడు బీజేపీలో చేరలేదు. రానున్న రెండు, మూడు రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నారు. కాసేపటి క్రితమే టీడీపీని వీడుతున్నట్లు పేర్కొంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు నలుగురు ఎంపీలు సంతకాలు చేసి లేఖ అందజేశారు.
పేదల రాజ్యాన్ని జగన్ పులివెందులగా మార్చారు: నారా లోకేష్