telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు వెనక్కి: టీడీపీ నేతలు

ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతోందని రాయిటర్స్ ప్రచురించిన వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. ప్రభుత్వ విధానాలపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతిలో రైతుల ఆందోళనకు మద్దతు తెలపడానికి వచ్చిన  ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు కియా తరలింపుపై స్పందించారు.

కియా పరిశ్రమను అనంతపురం నుంచి వేరే రాష్ట్రానికి ఎందుకు తరలిస్తున్నారన్న విషయంపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని రైతులు ఇన్ని రోజులుగా చేస్తోన్న ఆందోళనను జగన్ ఏ మాత్రం పట్టించుకోవట్లేదని ఆయన విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని నక్కా ఆనంద బాబు విమర్శించారు. కియా వంటి పరిశ్రమలు తరలిపోవడం రాష్ట్రానికి నష్టమని చెప్పారు.

Related posts