telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బోటు ప్రమాదం ప్రమాదంపై విచారణ ఏమైందో: పంచుమర్తి అనురాధ

Panchumarthi-Anuradha

గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం వెలికి తీసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం వల్లే బోటు వెలికితీత ఆలస్యమయిందని అన్నారు. బోటు ప్రమాదంపై విచారణ ఏమైందో కూడా అర్థం కావడం లేదని విమర్శించారు.

ఈ ప్రమాదంలో ఏ1గా జగన్, ఏ2గా మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్లను చేర్చాలని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పెద్దలు ఇంత వరకు పరామర్శించలేదని చెప్పారు. అసలు ఎంత మంది చనిపోయారనే విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందా? అని ప్రశ్నించారు.

Related posts