ఏపీ రాజధాని ప్రాంతం మంగళగిరిలో టీడీపీ ఆవిర్భావ సంబరాలు అంబరాన్నాంటాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు అవుతున్న సందర్భంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులర్పించారు.
అనంతరం టీడీపీ ఆవిర్భావ దినోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. స్వయంగా బుల్లెట్ నడుపుతూ లోకేశ్ టీడీపీ శ్రేణుల్లో జోస్ నింపారు. ఈ ర్యాలీలో టీడీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. జై ఎన్టీఆర్.. చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
టీడీపీ డైరెక్షన్ లో, బీజేపీ ముసుగులో.. పవన్ పై మంత్రి వెల్లంపల్లి ఫైర్