ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతోందనే వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ప్లాంటును తమిళనాడుకు తరలించే యోచనలో ఆ సంస్థ ఉందని రాయిటర్స్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు స్పందిస్తూ ఏపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్లే పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని మండిపడుతున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం తప్పు చేశారని వారికి ఇటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి? రాష్ట్రం నుంచి కియా తరలిపోతోందంటే రాష్ట్ర భవిష్యత్తుపై చావు దెబ్బ కొట్టినట్లే’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.