telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైద్యం అందక పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు: నారా లోకేశ్

Nara Lokesh

పేదలకు కనీస వైద్య సేవలందక రోడ్లపై ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ప్రజలు రోడ్ల మీదే ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే వారు లేరు. అనంతపురం జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన జగన్ గారి అసమర్థ ప్రభుత్వ పనితీరుకి ఉదాహరణ’ అని ఆయన ట్వీట్ చేశారు.

జగన్ రెడ్డి గారి పబ్లిసిటీ స్టంట్స్ ప్రజల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి. ఇప్పటికైనా ఆయన మొద్దునిద్ర వీడాలని ఆయన విమర్శలు గుప్పించారు. అనారోగ్యానికి గురైన ధర్మవరంకి చెందిన రాజుని కుటుంబ సభ్యులు ఆటోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రాణాలు పోతున్నాయి కాపాడాలని ప్రాధేయపడినా కనికరం చూపించలేదు. వైద్యం అందక రాజు గారు చెట్టు కిందే ప్రాణాలు కోల్పోయారు’ అని లోకేశ్ విమర్శించారు.

Related posts