కృష్ణా జిల్లాలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి దారుణ హత్యకు గురయ్యారు. నాగాయిలంక మండలం, పరచివరలో తాతా సాంబయ్యను దారుణంగా హత్య చేశారు. ఇటీవల జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాగా ఆయన నాగాయిలంక నుంచి స్వగ్రామానికి మొటారు వాహనంపై వస్తుండగా మార్గమధ్యలో మరకపాలెంవద్ద ఆయన బైక్ను అడ్డుకుని అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనతో ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.