telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం: టీజీ వెంకటేశ్

TG Venkatesh MP

ఏపీ టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు తమను ప్రత్యేక గ్రూప్ గా పరిగణించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి విజ్ఞప్తి చేశారు. కొద్దిసేపటి క్రితం సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ లు వెంకయ్యనాయుడుని కలిసి ఈ లేఖను అందజేశారు.టీడీపీని విభేదించి బయటకు వచ్చామని వారు వెల్లడించారు.

అనతరం టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ప్రజాభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. వారం రోజుల క్రితమే తమ అధినేత చంద్రబాబును కలిశానని చెప్పారు. పార్టీని వీడొద్దని, పార్టీకి నష్టం కలిగించొద్దని తనకు సూచించారని అన్నారు.

Related posts