telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబును చూసి ఎవరు ఓటెయ్యరు: ఎంపీ జేసీ

TDP MP JC Diwakar reddy sensational comments

ఏపీ సీఎం చంద్రబాబు పై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చూసి ప్రజలు ఓట్లేస్తారని చంద్రబాబు భావిస్తున్నారని కానీ అది సాధ్యం కాదని జేసీ స్పష్టం చేశారు. చేసేదంతా ఎమ్మెల్యేలు అయితే చంద్రబాబు నాయుడును ఎవరు చూస్తారంటూ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే 40 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితేనే చంద్రబాబు రాజ్యం వస్తుందని లేకపోతే కష్టమేనని వెల్లడించారు. ఇటీవలే 40 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబును కలిశారు.

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో మరోసారి జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తొలుత అనంతపురం పార్లమెంట్ పరిధిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి ఈసారి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలంటూ వ్యాఖ్యలు చెయ్యడంతో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది. దీంతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు టికెట్ దక్కుతుందో లేదో అనే సందేహంలో ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts