తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆ పార్టీ పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు ప్రకటించారు. ఇటీవల టీడీపీని వీడుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు. ప్రజాసేవకు పదవులు అక్కర్లేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని పేర్కొన్నారు. ప్రజాసేవకు సంకల్పం ఉంటే చాలు అని అభిప్రాయపడ్డారు.
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాల్లో 13 సీట్లు వైసీపీ చేజిక్కించుకుంది. పాలకొల్లు, ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.