వైసీపీ ఎమ్మెల్యే రోజావి పగటి కలలేనని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. శుక్రవారం తిరుమల వెంకటేశ్వర స్వామిని అనిత దర్శించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లడుతూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడని వైసీపీ ఎమ్మెల్యే రోజా కలలు కుంటోందని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని అనిత జోస్యం చెప్పారు. జగన్ మరోసారి త ప్రతిపక్ష నేతగా మిగిలిపోతారని చెప్పారు.
అప్పుడు రోజా కన్నకలలు అన్నీ పగటి కలలుగానే మిగిలిపోతాయని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీ మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని తాను భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ప్రజలు ఇచ్చే తీర్పుతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలి: వంగవీటి రాధా