ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో టీడీపీ నేత పట్టాభిరామ్ను కోర్టు హాజరుపరిచారు. మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ఆయనను గురువారం పోలీసులు హాజరుపరిచారు. సీఎం జగన్ఫై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై సెక్షన్ 153 (ఎ), 505(2), 353, 504 రెడ్ విత్ 120(బి) కింద (క్రైం నంబర్.352/2021) కేసు నమోదైంది.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పట్టాభికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ బందో బస్తు మద్య పట్టాభిని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలించే సమయంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
కాగా..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను..టీడీపీ నేత పట్టాభిరామ్ ఇంటిలోకి 30 మంది బలగాలు చొరబడి, తలుపులు పగల కొట్టి మరీ రాత్రి 10 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్కు తరలించిన విషయం తెలిసిందే.