telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అచ్చెన్నకు అధిక రక్తపోటు.. జీజీహెచ్‌లో చికిత్స!

Tdp Achennaaidu

ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు నిన్న నిర్వహించిన వైద్య పరీక్షల్లో అధిక రక్తపోటు నమోదైంది.

కాళ్లు, చేతులు తిమ్మిర్లుగా ఉన్నట్టు అచ్చెన్న వైద్యులకు చెప్పారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అవసరమైన మందులు వాడాలని సూచించారు. కాగా, ఈ నెల 17న అచ్చెన్నకు సర్వజన ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనను ఈఎస్ఐ కుంభకోణం కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విధితమే.

Related posts