telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబుపై ఆరోపణలు చేయడం దారుణం: కనకమేడల

Tdp kanakamedala

అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రథానికి నిప్పుపెట్టిన ఘటనపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. చంద్రబాబునాయుడు రథం తగులబెట్టాడని చెబుతూ హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.చంద్రబాబుపై ఇలాంటి ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు.

ప్రజలను అవహేళన చేసే రీతిలో అధికార వైసీపీ నేతలు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తుండడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు.కొడాలి నాని వంటి వాళ్లు ప్రత్యేకమైన భాష వాడుతుంటారని, ఊరకుక్కలు అంటూ మాట్లాడుతుంటారని, అది వారి సంస్కారానికే వదిలేస్తున్నామని పేర్కొన్నారు.

 చంద్రబాబు పక్కన ఉండేవి ఊరకుక్కలు అయితే, అటువైపు జగన్ పక్కన ఉండేవి ఏ కుక్కలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. సీఎంగా జగన్ వచ్చాక ఆలయాలపై 17 దాడులు జరిగాయని ఆరోపించారు. దీనికి అధికారపక్షమే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.

Related posts