74వ స్వాతంత్ర్య వేడుకలను ఈ రోజు జరుపుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడిన మాట్లాపై మాజీ మంత్రి కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య వేడుకల్లో జగన్ వాస్తవాలు చెప్పడం లేదన్నారు. 90 శాతం హామీలు అమలు చేశామని డప్పులు కొట్టుకుంటున్నారన్నారు. వాస్తవానికి ఒక్క హామీని పూర్తి అమలు చేయలేకపోయారని విమర్శించారు.
జగన్ హయాంలో ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రం ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే దాడులు, ఎదిరిస్తే హత్యలు, భూకబ్జాలు, దోపిడీలు, అఘాయిత్యాలకు తెగపడుతున్నారన్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో జగన్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఒక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ప్రవర్తిస్తూ మరో వైపు కళ్లబొల్లి మాటలు చెప్పడం హేయమని అన్నారు.
జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన నారాయణ