ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనుషులను చంపకుండా ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నారని జగన్ తీరుపై మండిపడ్డారు. అధికారం ఉందనే అహంతో జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఆపేయించాడని ఆరోపించారు. బస్సుల సీజ్ విషయంలో కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయడంలేదని ఫైర్ అయ్యారు.
ఇప్పుడు మరో విధంగా తమను దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ భూములను వెనక్కి తీసుకున్నారని జేసీ మండిపడ్డారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమకు ఏమీ కాదన్నారు. ప్రభుత్వ చర్యపై కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. సున్నపురాయి నిక్షేపాలను తరలించినట్లు వస్తోన్న ఆరోపణలను జేసీ తోసిపుచ్చారు. కావాలనే తమపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇన్నాళ్లు చట్టాల కళ్లు కప్పారు… ఇకపై అలాంటివి సాగవు: విజయసాయి రెడ్డి