telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మహిళల అరెస్టుపై స్పందించిన గల్లా జయదేవ్

galla jayadev got new responsibilities

అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దని మందడంలో ఆందోళనకు దిగిన మహిళా రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో వారిని అక్కడి నుంచి తరలించే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వేలాది పోలీసులను దించి ఈ ఆందోళనను అణచివేయగలమని అనుకోవడం వారి అవివేకం’ అని గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు.

నేపథ్యంలో పోలీసుల తీరుపై పలు దినపత్రికల్లో వచ్చిన వార్తలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘అమరావతిని రాజధానిగా కొనసాగించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలను అప్రజాస్వామికంగా అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన రైతులపై, మహిళలపై పోలీసుల దాడులు హేయనీయమని పేర్కొన్నారు.

Related posts