అమరావతి మహిళలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణమని సినీ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి మండిపడ్డారు. రక్షకభటులే భక్షకభటులైతే సామాన్యుడికి రక్షణ ఎక్కడిదని ప్రశ్నించారు. పశువుల కన్నా హీనంగా మాహిళలను ఈడ్చి పారేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్కి విశాఖలో ర్యాలీకి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.
మహిళలకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగనన్న వస్తాడని హోం మంత్రి సుచరిత, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారని… అమరావతిలో మహిళలు కంటతడి పెడుతుంటే మీ జగనన్నకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతులను వైసీపీ నేతలు కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీకి కేసీఆర్ సహకరిస్తున్నారు: బండి సంజయ్