telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారు: చినరాజప్ప

Chandrababu rejects peddapuram seat

ఏపీలో నెలకొన్న కృత్రిమ ఇసుక కొరతను నిరసిస్తూ తమ నేతలు చేపట్టిన దీక్షను భగ్నం చేయడం సబబు కాదని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికులు వీధినపడితే సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని చినరాజప్ప ప్రశ్నించారు. ఇసుక లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారని అన్నారు.

ఇసుక కొరత కారణంగా కార్మికులకు పనులు లేక వీధినపడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆయన విమర్శలు గుప్పించారు. పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో తాము ఇలాగే వ్యవహరించి ఉంటే జగన్ తిరిగి ఉండేవారా? అని ప్రశ్నించారు. కచ్చులూరు బోటు మునిగిన ఘటనపై ఆయన స్పందిస్తూ ఈ ప్రమాదం జరిగి ఇన్నిరోజులు గడస్తున్నా బోటును వెలికితీయలేకపోయారని విమర్శలు చేశారు.

Related posts