జగన్ ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. అయ్యన్న పాత్రుడి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత ఘటనపై చంద్రబాబు నాయుడు స్పందించారు.
ఇది ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపేనని అన్నారు. తమ పార్టీకి చెందిన బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని వైసీపీ అక్రమంగా కేసులు అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు.
చోడవరం మినీమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాడనే అక్కసుతోనే అయ్యన్నపాత్రుడి ఇంటిపై చీకటి దాడులు చేయించాడని ఆరోపించారు. అయ్యన్న అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా సమాధానం ఇవ్వలేని, దమ్ములేని జగన్ కూల్చివేతకి పాల్పడ్డాడని విమర్శించారు.
మా సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేత ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపే. టిడిపిలో బలమైన బీసీ నేతలని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకి @ysjagan పాల్పడుతున్నారు.(1/3) pic.twitter.com/9NBNN4RTHi
— N Chandrababu Naidu (@ncbn) June 19, 2022
ప్రజావేదికను కూల్చి వేస్తే ప్రజాధనం దుర్వినియోగం: కేశినేని నాని