telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని వ‌ల్ల‌కాడు చేసింది – చంద్రబాబు

*వైసీపీ మూడేళ్ల పాల‌న‌పై చంద్ర‌బాబు ఛార్జ్‌షీట్‌
*రాష్ర్టంలో శాంతిభద్ర‌త‌లు లేవు..
*వైసీపీ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని వ‌ల్ల‌కాడు చేశారు.
*ప్ర‌శ్నిస్తే అరెస్ట్ లు చేసి భ‌యబ్రాంతుల‌కు గురిచేస్తున్నారు..
*నాపై కేసులు పెట్టారు..
*డీజీపీలు మారీనా వ్య‌వ‌స్థ‌లో మార్పు రాలేదు..
*సీఎం జ‌గ‌న్‌ది ఐర‌న్ లెగ్‌..

జ‌గ‌న్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్లీ కార్యాలయంలో మాట్లాడుతూ ..మూడేళ్ల పాలనలోనే ఏపీని వల్లకాడు చేశారని విమర్శించారు. ప్రజలు తమ బాధలు చెప్పుకునే వీలులేకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. నలుగురు మాజీ మంత్రుల్ని కూడా జైలుకు పంపించారని చంద్రబాబు గుర్తు చేశారు. గ్రామస్థాయిలో టీడీపీకి చెందిన 4 వేల మంది కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని చంద్రబాబు చెప్పారు. దళితులు, బీసీలు, గిరిజన నేతలపై వైసీపీ దాడులు, హత్యలు చేసిందని చంద్రబాబు ఆరోపించారు.రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది పార్టీ నేతలను కేసులతో వేధించే ప్రయత్నం చేశారన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయన్నారు. కొత్త డీజీపీ బాధ్యతలు స్వీకరించినా కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన విమర్శలు చేశారు. నేరస్థుడు పరిపాలిస్తున్నారు కాబట్టి.. పోలీసులు నేరస్తులకు వంతపాడుతున్నారా..? పోలీసుల తీరు మారకుంటే.. మేమే మారుస్తాం.. ఏ విధంగా చేయాలో మాకు తెలుసు’’ అంటూ చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.

Related posts