telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రాన్ని వైసీపీ అగ్నిగుండంగా మారుస్తోంది: చంద్రబాబు

chandrababu

ప్రాంతాల మధ్య విద్వేషాలను రగిల్చి రాష్ట్రాన్ని వైసీపీ అగ్నిగుండంగా మారుస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. విశాఖలో రౌడీలు కాగడాలు పట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. సభ్యత్వం ఇవ్వని క్లబ్బుల భూములకు ఎసరు పెడుతున్నారని ఆరోపించారు. ముడుపులు, వాటాలు ఇవ్వని కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారని, ఖాళీగా కనిపించిన భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.

దేశంలోనే అతి పెద్ద ఎఫ్డీఐ అయిన కియా పరిశ్రమ, గార్మెంట్ ఇండస్ట్రీ, విండ్, సోలార్ పవర్ ప్లాంట్లు తదితర ఎన్నో పరిశ్రమలతో రాయలసీమలో వేలాది మందికి ఉపాధి కల్పించామని చంద్రబాబు చెప్పారు. ఇంత చేసిన తాము ద్రోహులమా? కియా యాక్సిలరీ యూనిట్లను పూణేకు తరిమేసి వేలాది ఉద్యోగాలను పోగొట్టిన మీరు ద్రోహులా? అని ట్విట్టర్ లో ప్రశ్నించారు.

Related posts