telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు విజయనగరంలో చంద్రబాబు పర్యటన

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు విజయనగరం జిల్లాలో నిర్వహించనున్న ప్రజాచైతన్య యాత్రలో పాల్గొననున్నారు. జిల్లాకు రానున్న చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఉదయం 11.30 గంటలకు బాబు కొత్తవలస చేరుకోనున్నారు.

మధ్యాహ్నం శృంగవరపుకోటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం కొటారుబిల్లి, రాత్రికి విజయనగరం బహిరంగ సభలలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.

Related posts