తిరుమల శ్రీవారి ఆస్తులను కాపాడుకుంటామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. విలువైన శ్రీవారి ఆస్తులను కారుచౌకగా కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధన దాహంతో శ్రీవారి ఆస్తులను కొట్టేయాలని వైసీపీ చూడటం నీచమని చంద్రబాబు అన్నారు.
తిరుమలకు ఏడుకొండలు ఎందుకని వైఎస్ అన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించామని, పింక్ డైమండ్ విషయంలో మాపై అసత్య ప్రచారం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. తిరుమల పవిత్రతను అపవిత్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, పవిత్రమైన శ్రీవారి లడ్డూని బల్క్ గా విక్రయించడమేంటి? అని ప్రశ్నించారు. సింహాచలంలో భూముల కబ్జా చేశారని, తిరుమల పుణ్యక్షేత్రమని వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొచ్చారని చెప్పారు.
ప్రతి రోజూ బాధను అనుభవిస్తూ పాలన: కుమారస్వామి