telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిత్యావసరాలను వైసీపీ నేతలతో పంపిణీ: చంద్రబాబు

chandrababu

కరోనా నేపథ్యంలో ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఓ లేఖ రాశారు.

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో నిత్యావసరాలను వైసీపీ నేతలతో పంపిణీ చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇందుకు సంబంధించి 250కి పైగా వీడియో, ఫొటోల ఆధారాలను ఆ లేఖకు జతచేసి చంద్రబాబు పంపారు. దీనిపై తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.

Related posts