telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతు తన పంటను అమ్ముకునే పరిస్థితులు లేవు: చంద్రబాబు

chandrababu

రైతు తన పంటను మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులు లేవని ఏపీ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. వారు పండించిన పంటకు ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పించలేకపోయిందని మండిపడ్డారు. కడపజిల్లా, గొల్లపల్లి గ్రామంలో తాము కష్టపడి పండించిన కూరగాయలను రైతులు నడిరోడ్డుపైనే పారబోయడం ఎంతో బాధాకరమైన విషయమని అన్నారు.

మద్యం అమ్మకాలకి అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. పండించిన కూరగాయలను బస్తాల్లో తీసుకొచ్చిన రైతులు వాటిని రోడ్డుపై పారపోస్తూ తమ నిరసన తెలిపారు.

Related posts