telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇంత చెత్త సీఎంను నేనెన్నడూ చూడలేదు: చంద్రబాబు

chandrababu

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కుప్పం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల భూ అక్రమాలను ఎండగట్టేందుకు విశాఖపట్టణం వెళ్తున్నానని అన్నారు. ఇంటి స్థలం ఇస్తామంటూ అసైన్డ్ భూములు లాక్కుంటున్నారని, భూ సేకరణ చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు బోధనా ఫీజులు చెల్లించకుండా మోసం చేస్తూ వసతి దీవెన అంటున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో 18 లక్షల రేషన్ కార్డులు, 7 లక్షల పింఛన్లు తీసేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం తొమ్మిది నెలలుగా ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు. తనపై గతంలో 26 కమిటీలు వేశారని, ఏమీ తేల్చలేకపోయారని, విచారణల పేరుతో వేధిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని అన్నారు.తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ, ఇంత చెత్త ముఖ్యమంత్రిని చూడలేదంటూ మండిపడ్డారు.

Related posts