జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేత కార్మికులకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కరోనా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. చేనేత కుటుంబాలకు రూ.24 వేలు ఇస్తామని చెప్పి కేవలం 80 వేల కుటుంబాలకే ఇస్తే మిగిలిన లక్షల కార్మికుల పరిస్థితి ఏంటి? అని ప్రశించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు మూడు నెలల కాలానికి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలి. నూలుపై సబ్సిడీ, పావలా వడ్డీ, త్రిఫ్ట్ ఫండ్ బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని ట్వీట్ చేశారు.
స్మృతి ఓటర్లకు కానుకలు ఎర చూపుతున్నారు: ప్రియాంక