రాష్ట్రంలో కూలీల పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల ఉపాధిని ప్రభుత్వం కాలరాస్తే ఆకలి బాధ తట్టుకోలేని కొందరు కూలీలు ఆలయాల్లో ప్రసాదాలపై ఆధారపడి బతుకుతున్నారని అన్నారు. మరో చోట మెతుకు కోసం చెత్తకుప్పల్లో వెతుకుతున్న ఓ కూలీని తలుచుకుంటే కళ్లు చెమర్చుతున్నాయని ట్వీట్ చేశారు.ప్రజలకు ఇంత దయనీయ పరిస్థితులు తీసుకువచ్చినందుకు వైసీపీ ప్రభుత్వ పాలకులు సిగ్గుపడాలని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన ఈ ఐదు నెలల్లో మీరు సాధించిన ఘనకార్యం ఇదేనా? అంటూ నిలదీశారు. కనీసం ఇలాంటి పరిస్థితుల్లో ‘అన్న క్యాంటీన్’ ఉన్నా కూలీల కడుపు నింపేదని తెలిపారు. ఇప్పుడైనా అన్న క్యాంటీన్లను తెరిచి పేదలను, కూలీలను ఆకలి నుంచి ఆదుకోవాలని హితవు చంద్రబాబు పలికారు.
చంద్రబాబును చూసి ఎవరు ఓటెయ్యరు: ఎంపీ జేసీ