ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్ కు తన అనుభవమంత వయసు లేదని కానీ తనను విమర్శిస్తారా అంటూ ప్రశ్నించారు. గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో జగన్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వంగా మారిందంటూ దుయ్యబుట్టారు. పాలన అనుభవం లేని జగన్ అన్నింటిని రద్దు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
పోలవరం కాంట్రాక్ట్ రద్దుచేశారని ప్రస్తుతం అన్న క్యాంటీన్లు కూడా తొలగించేస్తున్నారని ఆరోపించారు. తన జ్ఞపకాలు ఉండొద్దని జగన్ అన్నీ రద్దు చేస్తున్నారంటూ ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను తాము కూడా పూర్తి చేశామని కానీ జగన్ లా ప్రవర్తించలేదంటూ దుయ్యబట్టారు. అన్నీ రద్దు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం మరీ టీడీపీ హయాంలో వచ్చిన సీసీ రోడ్లు, మరుగుదొడ్లు కూడా తొలగిస్తారా? అంటూ నిలదీశారు. పెన్షన్లపై వైసీపీ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు.
కరీంనగర్ కేంద్రంగానే మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది : ఈటల