telugu navyamedia
Uncategorized

కరోనా విస్తరణకు వైసీపీ నేతలే కారణం: చంద్రబాబు

chandrababu tdp ap

ఏపీలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానానికి చేరుకుందన్నారు. రాష్ట్ర పరిస్థితి భయానకంగా ఉందని చెప్పారు.

రాష్ట్రంలో పారాసెటమాల్, బ్లీచింగ్ పౌడర్ దాటి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లిక్కర్ షాపుల ముందు పెద్దపెద్ద క్యూలు ఉంటున్నాయని అన్నారు. కరోనా విస్తరణకు వైసీపీ నేతలే కారణమని ఆరోపించారు. పేషెంట్లను క్వారంటైన్ చేయడంలో సైతం ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

Related posts