telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా కేసులు దాచిపెట్టడం మంచిది కాదు: చంద్రబాబు

chandrababu

కరోనా కేసులను దాచిపెట్టడం మంచిది కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ ప్రభుత్వం అలా చేయడం వల్ల వైరస్ మరింతగా వ్యాపిస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్ నుంచి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ లో తమ పార్టీ నేతలతో మాట్లాడారు. కోవిడ్-19 కేసులను దాచిపెట్టడం వల్ల జరిగే పరిణామాలకు ఉదాహరణ కర్నూలు, నెల్లూరు జిల్లాలేనని అన్నారు. కరోనా పరీక్షల వివరాలపై వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. అందువల్లే రాష్ట్రంలో ఈ మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని విమర్శించారు.

వైరస్ రోగులను కాపాడే వైద్య సిబ్బందికి రక్షణ నిచ్చే ఉపకరణాలు అవసరమని, అవి లేకపోవడం వల్లే వారు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ విషయమై ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి రక్షణ ఉపకరణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఏపీలో రేషన్ సరఫరా తీరుపై, తెల్లకార్డుదారులకు ప్రభుత్వం అందజేస్తానని ప్రకటించిన రూ.1000 నగదు సాయంపై ఆయన విమర్శలు గుప్పించారు.రేషన్ దుకాణాల్లో వినియోగదారులకు పంచదార ఇచ్చిన తర్వాత పది రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

Related posts